సత్యంవద లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
సత్యంవద లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
Unknown
నేను ఇలా అంటే మీకందరికీ కోపం రావచ్చు.. నా దేశభక్తి మీద అనుమానం రావచ్చు.. నాకేదో ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయని పుకార్లు పుట్టచ్చు. కానీ నేను చెప్పేది నిజం. అవును, కసబ్కి విధించిన వురిశిక్ష.. అదే నాలుగు వురిశిక్షల గురించే నేను మాట్లాడేది. నేను ఎందుకలా మాట్లాడుతున్నానో కొంచెం వివరంగా చెప్తాను వినండి.. ఆ తరువాత మీరు ఏమన్నా పడతాను..!!
అసలు చట్టం ఎందుకు వున్నట్లు? శిక్షలు ఎందుకు పెట్టినట్లు? ఎవరైనా తప్పు చేస్తే వాడికి అందుకు ప్రతిఫలంగా శిక్ష విధిస్తే చెల్లుకి చెల్లు అయిపోతుందనా? కాదు..! ఫలానా తప్పుకు ఫలానా శిక్ష పడుతుందని తెలిస్తే ఆ తప్పు చెయ్యకుండా వుండేందుకు. ఫలానా వాడి కన్ను తీశావు కాబట్టి నీ కన్ను తీస్తాను, కాలుకి కాలు అంటూ చెల్లు కి చెల్లు కొట్టే శిక్షలు భారతదేశంలో లేవు. మన శిక్షలన్నీ తప్పు చెయ్యకుండా ఆపడానికే కాని, తప్పు చేసినవాడిని శిక్షించడానికి కాదు. ఎవరికైనా పడిన శిక్ష ఆ వ్యక్తికి పశ్చాత్తాపాన్ని కలిగించినా లేకపోయానా, అలాంటి తప్పు చెయ్యడానికి ఇంకెవ్వరూ ముందుకి రాకుండా చెయ్యడామే ఆ శిక్ష ప్రధమోద్దేశ్యం.
మనం చేసే ప్రతి పనికి ఒక పర్యవసానం వుంటుందని ఇంతకు ముందు టపాలో చెప్పాను. ఆ పర్యవసానం మన మీద వుండచ్చు, మన ఇరుగు పొరుగు మీద వుండచ్చు, తరువాతి తరాలమీద వుండచ్చు అని కూడా విన్నవించాను. అసలు తప్పు అనే చర్య ఏమిటి అని ఆలోచిస్తే ఆ పని యొక్క చెడు పర్యవసానం పది మంది మీద పడి, దాని వల్ల జరిగే మంచి కేవలం ఒక్కడికే కలిగితే ఆ పని తప్పుగా నిర్ణయించవచ్చు. (ఇది అర్థం కావటం కష్టమే అయినా, కొంచెం ఆలోచించండి, మరో టపాలో వివరిస్తాను). వుదాహరణకి బస్సు ఎక్కడానికి లైన్లో నిల్చున్నాం అనుకోండి ఎవడో ఒకడు లైనుని కాదని తోసుకుంటూ వెళ్ళి బస్సులో సీటు పట్టుకుంటాడు. ఈ చర్య వల్ల నష్టం లైన్లో నిలబడ్డవారికి - సీటు న్యాయంగా దొరకాల్సినవాడికి దొరకకపోవటం, లైన్లో వున్న మరికొంతమంది బలవంతులు లైను తప్పి తోసుకోవడం, స్థూలంగా లైన్లో రావాలి అన్న సామాజిక బాధ్యతకి విలువ తప్పిపోవడం - ఇవీ నష్టాలు. కానీ అదే చర్యకు "పాసిటివ్" పర్యవసానం ఆ లైను తప్పినవాడికి - సీటు దొరకడం ద్వారా లభించింది - లాభించింది. అదువల్ల ఇది తప్పు - ఈ తప్పుని శిక్షించాలి.
ఎలా శిక్షించాలి? అతనికి ఏదైతే లాభం కలుగుతోందో ఆ లాభాన్ని లేకుండా చెయ్యాలి - లేదా ఆ లాభానికి సరిపడ విలువైనదేదైనా అతనిని నుంచి తీసుకోవాలి. అది ఫైన్ కావచ్చు, బస్సులో ఎక్కిన వారంతా అసహ్యించుకోవడం కావచ్చు, లేదా బస్సు యాజమాన్యం ఒక ప్రకటన చెయ్యవచ్చు - లైన్లో వచ్చిన వారికి సీటు, రాని వారు నిలబడాలి అని. అంటే ఏదైతే "ఆశించే ప్రవనర్త (Desired behaviour)" వుంటుందో ఆ ప్రవర్తనని అభినందిస్తూ "పాజిటివ్ ఇన్సెంటివ్ (Positive Incentive)" ఇవ్వడం, లేదా ఎవరైతే "ఆశించే ప్రవర్తన"కు భిన్నంగా ప్రవర్తిస్తారో వారికి "నెగటివ్ ఇన్సెంటివ్ (Negative Incentive)" ఇవ్వడం అనే రెండు విధానాల ద్వారా మనిషి ప్రవర్తనని నియంత్రిచడమే చట్టం, న్యాయ వ్యవస్త అన్నీనూ. ట్రాఫిక్ పోలీసు ఫైన్ వేసినా, టికెట్టు లేని ప్రయాణం నేరం అందుకు రూ 500 వరకూ జరిమానా అంటూ బోర్డులు పెట్టినా అవన్నీ ఇందుకే.
అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ "నెగెటివ్ ఇన్సెంటివ్" ఆ తప్పు చేస్తున్న వ్యక్తికి లభిస్తున్న లాభానికి కనీసం సమానంగా, ఆ ఫలితానికి వ్యతిరేకంగా వుండాలి (atleast equal but opposite). సమానం అనేది ఆర్థికంగా మాత్రమే కాకపోవచ్చు. బాగా డబ్బున్న వాడు కారులో రాంగ్ సైడ్ వెళ్తే అతనికి ఐదువందల రూపాయల జరిమానా వేస్తే అతనికి అదేం పెద్ద లెఖ్ఖ కాదు. డబ్బులు పడేసి దర్జాగా పోతాడు. కావాలనే రోజూ రాంగ్ రూట్లో వచ్చి "ఆఫ్ట్రాల్ అయిదొందలు" పడేసిపోతాడు. అదే అతనిని కార్లో నించి దించి ఒక గంట ఎండలో నిలబెట్టి (ఇదుగో మా ఎస్సైగారు వస్తున్నారు, అదిగో సీయం కారు వస్తోంది అంటూ..)కావాలనే తాత్సారం చేసి, డబ్బులు తీసుకోకుండా పంపించినా మళ్ళీ అటు వైపుకి రావాలంటే జంకుతాడు. ఇలా జంకి "తప్పు" పనులు చెయ్యకుండా వుండటమే శిక్షల వుద్దేశ్యం.
కసబ్ సంగతి చెప్తూ ఈ కథలన్నీ ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. మన న్యాయస్థానం కసబ్కి వురి శిక్ష విధించింది. వురి అనే ప్రాణం తీయటం నిజంగానే పెద్ద శిక్షా? అని ప్రశ్నఒకటుంది. సరే అది అక్కడే వుంచి - అసలు కసబ్కి వురి నిజంగా శిక్షా అని ఆలోచిద్దాం. ఒకసారి టెర్రరిస్ట్ దృష్టితో చూడండి -
కసబ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్లో ఏమని చెప్పి వుంటారు - "మన జిహాద్ అనే పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధం అవ్వాలి" - అని వుర్దూలో చెప్పి వుంటారా? దానికి సిద్ధపడే కసబ్ భారతదేశానికి వచ్చాడా? వాడు సిద్ధపడ్డ చావుని వాడికే ఇచ్చి దాన్ని శిక్ష అని అంటే హాస్యాస్పదంగా కనిపించడంలేదూ? అతన్ని చంపడం ద్వారా ఉగ్రవాదులకి మన ప్రభుత్వం ఇచ్చే సందేశమేమిటి? "కసబ్ని చంపారూ రేపు మనల్ని కూడా చంపుతారు" అంటూ ఉగ్రవాదులు గజ గజ వణుకుతారా? లేదే..!!
ఉగ్రవాదం కోరుకునేదేమిటి? ముంబై తరహా చర్యల వల్ల ఏం సాధిస్తారు?
- భారతదేశానికి ఆర్థిక, రాజకీయ పరంగా నష్టం కలిగించడం
- భారతదేశ సార్వభౌమత్వాన్ని, మిలటరీ వ్యవస్థని ఎదిరించి వీలైతే వాటిని తక్కువ చేసి చూపించడం
- ముఖ్యంగా ప్రజలలో ఆందోళన, భయాన్ని సృష్టించడం తద్వారా అస్థిరత్వాన్ని తీసుకురావడం
ఇక ఆత్మాహుతి దాడి చెయ్యడానికి కారణం?
- తమ సిద్ధాంతాల, పైన చెప్పిన ఆశయాల సాధనకి ప్రాణాల్ని సైతం బలిపెట్టగలం అని ప్రకటించుకోవడం
- తమ ప్రాణాలని సైతం లెఖ్ఖ చెయ్యని తీవ్రవాదాన్ని చూసి ప్రజలు మరింత భయపడేలా చెయ్యడం
- చావుకైన సిధ్ధపడ్డ వాళ్ళని చూపించి, ఈ పోరులో చనిపోయిన వారిని చూపించి తమ ఆశయాలకు, సిద్ధాంతాలకు మరింత బలం చేకూర్చుకోవటం, మరింత మందిని ఇలాంటి చర్యలకు సిధ్ధం చేసుకోవడం
తీవ్రవాదం ఆశయాలు, కోరికలు ఇవైనప్పుడు మనం ప్రకటించే ఈ తీర్పు ఈ ఆశయాలకు కనీసం సమానంగా, వ్యతిరేక దిశలో వుండాలి. వుందా?
లేదే..!!
లేకపోగా మన తీర్పు తీవ్రవాదులు కోరుకున్న ఆశయాలకు బలం ఇచ్చేదిగా వుంది.
ఎందుకంటే.. ఇప్పుడు టెర్రరిస్ట్ కేంపుల్లో కసబ్ ఒక అమర వీరుడు.. అతని స్ఫూర్తితో మరింతమంది చావడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు టెర్రరిట్ ట్రైనింగ్లో - "మీరు చావడానికి సిద్ధపడండి, వీలైనంతమందిని చంపి మీరు ఆత్మాహుతి చేసుకోండి.. అలా చంపి చావడమే మన యుద్ధ న్యాయం.. ఒక వేళ దొరికిపోతే భారతదేశమే మిమ్మల్ని చంపుతుంది.." అంటూ కొత్త పాఠాలు చెప్తారేమో.
ఇప్పుడు ఆత్మహత్య చట్ట రీత్యా నేరం, అందుకని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న వాడికి ఉరి శిక్ష వేస్తే ఎలా వుంటుంది? జడ్జిగారు - "ఆత్మహత్యా యత్నం నేరం కింద నిన్ను వురి తీస్తున్నాను" అంటూ తీర్పు ఇస్తే ఆ ముద్దాయి కూడా నవ్వుకోడా? నిజమైన తీవ్రవాది అయితే కసబ్ కూడా అలా నవ్వుకుంటాడేమో?
ఈ వురి శిక్ష కారణంగా పాకిస్తాన్ గజ గజ లాడుతుంది, ఉగ్రవాదులు ప్యాంట్ తడుపుకుంటారు, అమెరికా పాకిస్థాన్కి ఆర్థిక సాయం ఆపేస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది వున్నారు - టీ.వీలో కనిపిస్తుంటారు. వాళ్ళను చూసి జాలి పడటం మినహా నేను చెయ్యగలిగిందేమి లేదు. భారతదేశంలో జరిగిన ఒక నేరము-శిక్ష కారణంగా అంతర్జాతీయ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి పాకిస్తాన్, అమెరికాలు చేతులు కట్టుకోని నిలబడతాయంటే అంత కన్నా పెద్ద జోక్ లేనే లేదు.
ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం (న్యాయమైనా అన్యాయమైనదైనా) చేస్తున్న వారిని ప్రభుత్వం చంపేస్తే ఆ పోరాటాలు మరింత బలంగా తయారయ్యాయి, ఆ చనిపోయిన వాళ్ళు ఆ పోరాటనికి అమర వీరులయ్యారు. ఆ విషయం భారతదేశంతో సహా ప్రపంచ దేశ చరిత్రలన్నింటిలోనూ వుంది..! రేపు ఉగ్రవాదులకు కూడా కసబ్ ఒక అమర వీరుడే అవుతాడు.. ఈ పాటికే భారత న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పుకి తీవ్రవాదులు పండగ చేసుకుంటుంటారు. కసబ్ నిజంగా కరడు గట్టిన తీవ్రవాదే అయితే ఈ తీర్పుకి అప్పిలు అడగడు.. ఆనందంగా వురి తగిలించుకుంటాడు... ఎందుకంటే అతను చంపడానికీ, చావడానికే కదా భారతదేశానికి వచ్చింది. చంపడం అతను చేశాడు, అతను చావడం అనే కోరిక మాత్రం ప్రభుత్వం తీరుస్తోంది.
Unknown
(ఇది వ్యాసంలొ మూడో భాగం
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
రెండో భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)
అతను అశ్వనీ నక్షత్రం అనగానే నాకు విషయం అర్థమైపోయింది.
"మాష్టారు..! మీరు నా వివరాలు ఎలా కనిపెట్టారో నాకు తెలుసు" అన్నాను.
ముందు ఎదురు చెప్పాడు, తరువాత మెత్తబడ్డాడు ఆ తరువాత ఒప్పుకున్నాడు. ఆ రహస్యమేమిటో మీకు చెప్తా వినండి. కానీ దానికి ముందొక పిట్ట కథ:
చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడే వాళ్ళం.. గుర్తుందా? ఏదైనా బొమ్మల చార్టుతోనో (అందులో అడ్డంగా అయిదు, నిలువుగా ఆరు మొత్తం ముఫై బొమ్మలుండేవి), లేదా పేకముక్కలతోనో ఒక ట్రిక్ చేసేవాళ్ళం. అయిదు ఇంటూ ఆరు ముప్పై బొమ్మలో/పేకలో పేర్చాక, ఎదుటివాణ్ణి అందులో ఏదో ఒకటి మనసులో తల్చుకోమనేవాళ్ళం. ఆ తరువాత ఈ వరుసలో వుందా, ఈ వరుసలో వుందా అంటూ అడ్డంగా, ఆ తరువాత అదే రకంగా నిలువు వరసలపైనా ప్రశ్నించేవాళ్ళం. అడ్డం వరుస నిలువు వరుస తెలిసిపోతే ఆ రెండు కలిసే గడి/పేకే వాళ్ళనుకున్నదని చెప్పేవాళ్ళం. అంటే మనకి కావల్సిన సమాధానం అవతలి వారి దగ్గరనించే రాబట్టేవాళ్ళం.
సరిగ్గా ఇలాగే నాడీ జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా ప్రశ్నల ద్వారా వాళ్ళకి కావాల్సిన విషయాన్ని మన నించే రాబడతారు. వారికి ప్రధానంగా కావల్సింది మన పేరు, జనన తేది, సమయం. ఇవి తెలుసుకోడానికి ఒక వంద, నూటాభై ప్రశ్నలుంటాయి. ఏవీ నేరుగా వుండవు - ఒకసారి ఇంగ్లీషు నెల గురించి అడిగితే మరోసారి వారం, మరో సారి తిధి, నక్షత్రం, సంవత్సరం, తెలుగు నెల, వయసు ఇలాగన్నమాట. ప్రతిసారి మనం చెప్పిన సమాధానం ఆధారంగా మన జనన తేదీకి దగ్గరవుతారు. మధ్యలో "రెండో" గ్రంధం తేవడానికి వెళ్ళినప్పుడు అవసరమైతే పాత పంచాంగాలో క్యాలుకులేటర్లో వాడుకుంటారు. ఇలా జనన తేది సమయం కనుక్కోలేకపోతే "అగస్త్యుడు ఈ రోజు కాదన్నాడు, మళ్ళీ రండి నెల తరువాత (అప్పటికి మీరు మా ప్రశ్నలు మర్చిపోతారు)" అని చెప్తారు.
పేరు ఎందుకు అంటే - అది మన వ్యక్తిగత వివరాలలో అతి ముఖ్యమైనది. అది చెప్పగలిగితే అవతలి వారిని పట్టేసినట్టే. దీంట్లో కూడా నక్షత్రం ఆధారంగా, పుట్టిన ప్రాంతం ఆధారంగా, కులం ఆధారంగా కొన్ని వూహించి ప్రశ్నలు అడుగుతారు.
ఇక మిగిలిన ప్రశ్నలు. ఇవి ప్రధానంగా జననతేదీ కనుక్కునే ప్రశ్నల మధ్యలో అడిగేవి. అంటే జననతేది సంబంధించిన ప్రశ్నలే వేస్తున్నారు అని అనుమానం రాకుండా ఏమార్చేందుకు వుపయోగపడతాయి. చాలా తెలివిగా సర్వ సాధారణమైనవి, ఓపెన్ ఎండెడ్ (open ended) ప్రశ్నలు వేస్తారు. "మీకు చిన్నప్పుడు ఒక ప్రమాదం తప్పింది కదా?" లాంటివి. చిన్నప్పుడు అంటే ఎంత చిన్నప్పుడు? 90% మందికి చిన్నప్పుడు ఏదో ఒక గాయమో, దెబ్బో, ఇంట్లోంచి తప్పిపోవడమో ఏదో ఒకటి జరిగేవుంటుంది కదా. ఇందులో "అవును" అని సమాధానం వచ్చినవన్నీ ఒక పక్క మెమొరీలో స్టోర్ అవుతుంటాయి. వాటి వుపయోగం చివర్లో చెప్తాను.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే - ప్రశ్నలు అడిగే విధానం. ఇది స్కూల్ మాష్టరు పిల్లల్ని అడిగినట్లు కాకుండా ఏదో క్లూ ఇస్తున్నట్టు అడుగుతారు.
"మీకు పెళ్ళి ఇరవై నాలుగూ ఇరవై ఎనిమిదీ మధ్య అయ్యిందా?" అంటూ.
వచ్చిన వాళ్ళలో కొంతమంది (పూర్వ జన్మలో!!) కూచిపూడి కళాకారులు వుంటారు. ప్రశ్న సగంలో వుండగానే ముఖం చిట్లించి, తల వూపేస్తారు. అలాంటి ఎక్ష్ప్రెషన్ కనపడగానే ప్రశ్న మారిపోతుంది.
"మీకు పెళ్ళి అయ్యి ఇప్పటికి (అప్పటికే ముఖం చిట్లిస్తే అసలు పెళ్ళికాలేదు అని) నాలుగు, అయిదు సంవత్సరాలూ... (ఇక్కడ చిట్లిస్తే) పోనీ ఏడు ఎనిమిది సంవత్సరాలు అయ్యింది" అంటాడు
మరికొంతమంది (పూర్వ జన్మలో) దానకర్ణులు వుంటారు. వీళ్ళు ప్రశ్న అడగాన్నే "అవునండీ అసలేం జరిగిందంటే చిన్నప్పుడు నేను మా తాతయ్య వాళ్ళింట్లోనే వుండేదాన్నేమో... అబ్బ దబ్బ జబ్బ అబ్బ్బ జాబ్బ్బ"
ఇలాంటి వాళ్ళు దొరికితే అదేంటో అన్నీ అగస్త్యమహాముని వ్రాసిన పుస్తకాలే దొరుకుతాయి. నాడీ జాతకం చెప్పించుకొని హాశ్చర్యపడిపోయిన మా మిత్రులు ఇలాంటివారే.
ఇంతవరకు విషయ సేకరణ పూర్తయ్యాక మీ ఆఖరు మరియు అసలైన నాడీ గ్రంథం తీసుకు రావటానికి లోపలికి వెళ్తాడు. లోపల కప్యూటరో, రెండు వేల సంవత్సరాల పంచాంగమో వుంటుంది. మీ జాతక చక్రం వేసేస్తారు. ఇక బయటికి వచ్చి గ్రంధం తెరుస్తూనే లొడ లొడా మీరు ఇందాక ప్రశ్నలలో అవునన్న విషయాలు, అబ్బ దబ్బ జబ్బ అని చెప్పిన విషయాలు, కొంత కల్పిత కథలు, కొంత మీ జాతకం ఆధారంగా విషయాలు చెప్పేస్తారు. -
"అగస్య మహాముని తేదీ (ఈ రోజు డేటు) న ఇక్కడికి వస్తారని. (మిస్టర్ సొ సొ) చేత నాడీ జ్యోతిష్యం చెప్పించుకుంటారని ఇక్కడ వ్రాసుంది. పూర్వ జన్మలో మీరు భంభోజం అనే ఏనుగు. అప్పుడు ఒక ముని శాపం వల్ల ఈ జన్మ ఎత్తి గ్యాస్ తదితర ఉదర సంబంధమైన వ్యాధులతో బాధ పడుతున్నారు. (ఇందులో ముని శాపం అబద్ధం, పర్సనాలిటి చూస్తే గ్యాస్ ప్రాబ్లం వుందని చెప్పచ్చు/జాతకం ఆధారంగా కూడా చెప్పచ్చు లేదా మీ జేబులో జెలుసిల్ స్ట్రిప్ కనపడి వుండొచ్చు)." ఇలా సాగుతుంది. డబ్బులు సంగతి వేరే చెప్పక్కర్లేదనుకుంటా.
ఈ విషయం ఇలా జరుగుతుందని చెప్పగానే నాకు జాతకం చెప్పిన జ్యోస్యుడు ఒప్పుకున్నాడు. ముందు నేను ఆవేశంలో - "నీ బోర్డు పీకించేస్తాను, మా బ్యాచినేసుకొని వచ్చానంటే అయిపోతావ్.. ఈనాడుకి చెప్తాను" అని వీరంగం చేసాను. తరువాత అతను నిజాయితీగా - "సార్ నేను జాతక చక్రం చూడటం నేర్చుకున్నాను. మా విద్యలో ఏ లోపమూలేదు. అందరిలాగానే జనన తేదీని బట్టి జాతకం వేస్తాము. కాకపోతే ఆ జనన తేదీ తెలుసుకోడానికే ఈ నాటకం. ఏదైనా కడుపు నింపుకోడానికే" అన్నాడు. నేను వచ్చేసాను.
ఇది జరిగింది గుంటూరులో ఒక బ్రాంచిలో. హెడ్డఫీసులో కూడా ఇలాగే జరుగుతుందని నేననుకున్నాను. కాకపోతే అక్కడా ఇంత సులభంగా దొరికే ఘఠాలు వుండకపోవచ్చు. ఏది ఏమైనా అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టి, ఇలాంటి ప్రశ్నలు తయారు చేసి, పుస్తకాలు తయారుచేసినవాడు మహా మేధావి. ఈ ప్రశ్నలు అడగటానికీ చాలా తెలివితేటలు కావాలి. కాకపోతే నేనుకూడా కొంచెం తెలివైనవాణ్నే కదా..! అక్కడ దొరికిపోయారు...!!
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
రెండో భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
రెండో భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)
అతను అశ్వనీ నక్షత్రం అనగానే నాకు విషయం అర్థమైపోయింది.
"మాష్టారు..! మీరు నా వివరాలు ఎలా కనిపెట్టారో నాకు తెలుసు" అన్నాను.
ముందు ఎదురు చెప్పాడు, తరువాత మెత్తబడ్డాడు ఆ తరువాత ఒప్పుకున్నాడు. ఆ రహస్యమేమిటో మీకు చెప్తా వినండి. కానీ దానికి ముందొక పిట్ట కథ:
చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడే వాళ్ళం.. గుర్తుందా? ఏదైనా బొమ్మల చార్టుతోనో (అందులో అడ్డంగా అయిదు, నిలువుగా ఆరు మొత్తం ముఫై బొమ్మలుండేవి), లేదా పేకముక్కలతోనో ఒక ట్రిక్ చేసేవాళ్ళం. అయిదు ఇంటూ ఆరు ముప్పై బొమ్మలో/పేకలో పేర్చాక, ఎదుటివాణ్ణి అందులో ఏదో ఒకటి మనసులో తల్చుకోమనేవాళ్ళం. ఆ తరువాత ఈ వరుసలో వుందా, ఈ వరుసలో వుందా అంటూ అడ్డంగా, ఆ తరువాత అదే రకంగా నిలువు వరసలపైనా ప్రశ్నించేవాళ్ళం. అడ్డం వరుస నిలువు వరుస తెలిసిపోతే ఆ రెండు కలిసే గడి/పేకే వాళ్ళనుకున్నదని చెప్పేవాళ్ళం. అంటే మనకి కావల్సిన సమాధానం అవతలి వారి దగ్గరనించే రాబట్టేవాళ్ళం.
సరిగ్గా ఇలాగే నాడీ జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా ప్రశ్నల ద్వారా వాళ్ళకి కావాల్సిన విషయాన్ని మన నించే రాబడతారు. వారికి ప్రధానంగా కావల్సింది మన పేరు, జనన తేది, సమయం. ఇవి తెలుసుకోడానికి ఒక వంద, నూటాభై ప్రశ్నలుంటాయి. ఏవీ నేరుగా వుండవు - ఒకసారి ఇంగ్లీషు నెల గురించి అడిగితే మరోసారి వారం, మరో సారి తిధి, నక్షత్రం, సంవత్సరం, తెలుగు నెల, వయసు ఇలాగన్నమాట. ప్రతిసారి మనం చెప్పిన సమాధానం ఆధారంగా మన జనన తేదీకి దగ్గరవుతారు. మధ్యలో "రెండో" గ్రంధం తేవడానికి వెళ్ళినప్పుడు అవసరమైతే పాత పంచాంగాలో క్యాలుకులేటర్లో వాడుకుంటారు. ఇలా జనన తేది సమయం కనుక్కోలేకపోతే "అగస్త్యుడు ఈ రోజు కాదన్నాడు, మళ్ళీ రండి నెల తరువాత (అప్పటికి మీరు మా ప్రశ్నలు మర్చిపోతారు)" అని చెప్తారు.
పేరు ఎందుకు అంటే - అది మన వ్యక్తిగత వివరాలలో అతి ముఖ్యమైనది. అది చెప్పగలిగితే అవతలి వారిని పట్టేసినట్టే. దీంట్లో కూడా నక్షత్రం ఆధారంగా, పుట్టిన ప్రాంతం ఆధారంగా, కులం ఆధారంగా కొన్ని వూహించి ప్రశ్నలు అడుగుతారు.
ఇక మిగిలిన ప్రశ్నలు. ఇవి ప్రధానంగా జననతేదీ కనుక్కునే ప్రశ్నల మధ్యలో అడిగేవి. అంటే జననతేది సంబంధించిన ప్రశ్నలే వేస్తున్నారు అని అనుమానం రాకుండా ఏమార్చేందుకు వుపయోగపడతాయి. చాలా తెలివిగా సర్వ సాధారణమైనవి, ఓపెన్ ఎండెడ్ (open ended) ప్రశ్నలు వేస్తారు. "మీకు చిన్నప్పుడు ఒక ప్రమాదం తప్పింది కదా?" లాంటివి. చిన్నప్పుడు అంటే ఎంత చిన్నప్పుడు? 90% మందికి చిన్నప్పుడు ఏదో ఒక గాయమో, దెబ్బో, ఇంట్లోంచి తప్పిపోవడమో ఏదో ఒకటి జరిగేవుంటుంది కదా. ఇందులో "అవును" అని సమాధానం వచ్చినవన్నీ ఒక పక్క మెమొరీలో స్టోర్ అవుతుంటాయి. వాటి వుపయోగం చివర్లో చెప్తాను.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే - ప్రశ్నలు అడిగే విధానం. ఇది స్కూల్ మాష్టరు పిల్లల్ని అడిగినట్లు కాకుండా ఏదో క్లూ ఇస్తున్నట్టు అడుగుతారు.
"మీకు పెళ్ళి ఇరవై నాలుగూ ఇరవై ఎనిమిదీ మధ్య అయ్యిందా?" అంటూ.
వచ్చిన వాళ్ళలో కొంతమంది (పూర్వ జన్మలో!!) కూచిపూడి కళాకారులు వుంటారు. ప్రశ్న సగంలో వుండగానే ముఖం చిట్లించి, తల వూపేస్తారు. అలాంటి ఎక్ష్ప్రెషన్ కనపడగానే ప్రశ్న మారిపోతుంది.
"మీకు పెళ్ళి అయ్యి ఇప్పటికి (అప్పటికే ముఖం చిట్లిస్తే అసలు పెళ్ళికాలేదు అని) నాలుగు, అయిదు సంవత్సరాలూ... (ఇక్కడ చిట్లిస్తే) పోనీ ఏడు ఎనిమిది సంవత్సరాలు అయ్యింది" అంటాడు
మరికొంతమంది (పూర్వ జన్మలో) దానకర్ణులు వుంటారు. వీళ్ళు ప్రశ్న అడగాన్నే "అవునండీ అసలేం జరిగిందంటే చిన్నప్పుడు నేను మా తాతయ్య వాళ్ళింట్లోనే వుండేదాన్నేమో... అబ్బ దబ్బ జబ్బ అబ్బ్బ జాబ్బ్బ"
ఇలాంటి వాళ్ళు దొరికితే అదేంటో అన్నీ అగస్త్యమహాముని వ్రాసిన పుస్తకాలే దొరుకుతాయి. నాడీ జాతకం చెప్పించుకొని హాశ్చర్యపడిపోయిన మా మిత్రులు ఇలాంటివారే.
ఇంతవరకు విషయ సేకరణ పూర్తయ్యాక మీ ఆఖరు మరియు అసలైన నాడీ గ్రంథం తీసుకు రావటానికి లోపలికి వెళ్తాడు. లోపల కప్యూటరో, రెండు వేల సంవత్సరాల పంచాంగమో వుంటుంది. మీ జాతక చక్రం వేసేస్తారు. ఇక బయటికి వచ్చి గ్రంధం తెరుస్తూనే లొడ లొడా మీరు ఇందాక ప్రశ్నలలో అవునన్న విషయాలు, అబ్బ దబ్బ జబ్బ అని చెప్పిన విషయాలు, కొంత కల్పిత కథలు, కొంత మీ జాతకం ఆధారంగా విషయాలు చెప్పేస్తారు. -
"అగస్య మహాముని తేదీ (ఈ రోజు డేటు) న ఇక్కడికి వస్తారని. (మిస్టర్ సొ సొ) చేత నాడీ జ్యోతిష్యం చెప్పించుకుంటారని ఇక్కడ వ్రాసుంది. పూర్వ జన్మలో మీరు భంభోజం అనే ఏనుగు. అప్పుడు ఒక ముని శాపం వల్ల ఈ జన్మ ఎత్తి గ్యాస్ తదితర ఉదర సంబంధమైన వ్యాధులతో బాధ పడుతున్నారు. (ఇందులో ముని శాపం అబద్ధం, పర్సనాలిటి చూస్తే గ్యాస్ ప్రాబ్లం వుందని చెప్పచ్చు/జాతకం ఆధారంగా కూడా చెప్పచ్చు లేదా మీ జేబులో జెలుసిల్ స్ట్రిప్ కనపడి వుండొచ్చు)." ఇలా సాగుతుంది. డబ్బులు సంగతి వేరే చెప్పక్కర్లేదనుకుంటా.
ఈ విషయం ఇలా జరుగుతుందని చెప్పగానే నాకు జాతకం చెప్పిన జ్యోస్యుడు ఒప్పుకున్నాడు. ముందు నేను ఆవేశంలో - "నీ బోర్డు పీకించేస్తాను, మా బ్యాచినేసుకొని వచ్చానంటే అయిపోతావ్.. ఈనాడుకి చెప్తాను" అని వీరంగం చేసాను. తరువాత అతను నిజాయితీగా - "సార్ నేను జాతక చక్రం చూడటం నేర్చుకున్నాను. మా విద్యలో ఏ లోపమూలేదు. అందరిలాగానే జనన తేదీని బట్టి జాతకం వేస్తాము. కాకపోతే ఆ జనన తేదీ తెలుసుకోడానికే ఈ నాటకం. ఏదైనా కడుపు నింపుకోడానికే" అన్నాడు. నేను వచ్చేసాను.
ఇది జరిగింది గుంటూరులో ఒక బ్రాంచిలో. హెడ్డఫీసులో కూడా ఇలాగే జరుగుతుందని నేననుకున్నాను. కాకపోతే అక్కడా ఇంత సులభంగా దొరికే ఘఠాలు వుండకపోవచ్చు. ఏది ఏమైనా అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టి, ఇలాంటి ప్రశ్నలు తయారు చేసి, పుస్తకాలు తయారుచేసినవాడు మహా మేధావి. ఈ ప్రశ్నలు అడగటానికీ చాలా తెలివితేటలు కావాలి. కాకపోతే నేనుకూడా కొంచెం తెలివైనవాణ్నే కదా..! అక్కడ దొరికిపోయారు...!!
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
రెండో భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)
Unknown
(ఇది వ్యాసంలో రెండో భాగం
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)
మరో రెండు నెలలు గడిచాయి. ఈ సారి గుంటూరులో వాళ్ళ బ్రాంచి వచ్చిందని పేపర్లో చదివాను. మళ్ళీ నా తెహల్కా మొదలైంది. ఈసారి మరీ అనుమానంతో కాకుండా కొంచెం నమ్మేవాడిలా ప్రవర్తించాలని అనుకున్నాను. మళ్ళీ అదే రకమైన గది, మళ్ళీ అదే కాషాయం, తాళపత్రం, అదే వుపోద్ఘాతం. ఆ తరువాత తమిళంలో పద్యాలు, తెలుగు తర్జుమా ప్రశ్నలు.
"మీ పేరు ర, క, మ తో ప్రారభమౌతుందా?"
"లేదు"
"అయితే ఈ పేజిలో లేదు.
"అంటే"
"ఇది మరెవరిదో. ఒక్కొక్క పత్రంలో ఒక్కొక్కరి జాతకం వుంటుంది.
"సరే అడగండి"
"మీ వయసు 21-25 మధ్యలో వుందా"
"అవును"
"మీ సొంతవూరు గుంటూరు"
"సొంత వూరంటే పుట్టిన వూరా? పెరిగిన వూరా?"
"ఎక్కువ కాలం గడిపిన వూరు"
"గుంటూరే.. పుట్టింది మాత్రం నెల్లూరు"
"గుంటూరే వుంది.. మీ నక్షత్రం ప, మ, ఆ లతో మొదలౌతుందా"
"లేదు"
"మీరు పుట్టిన నెల జనవరి నుంచి జూన్లో వుందా?"
"వుంది"
"మీకు చిన్నప్పుడు చిన్న అగ్ని ప్రమాదం జరిగిందా?"
"చిన్నప్పుడంటే ఆరో ఏట దీపావళికి టపాసు కాలుస్తుంటే చేతిలో పేలింది"
"మీరు పుట్టిన తేది సరి సంఖ్యా"
"అవును"
"మీరు ప్రైవేటు అంటే బ్యాంకులు, సాఫ్ట్వేర్ వుద్యోగం చేస్తున్నారా?"
"లేదు"
"మీరు గవర్న్మెంటు వుద్యోగం చేస్తున్నారా"
"అవును"
"మీరు పుట్టిన నెల వైశాఖం, జేష్టం ఆషాఢంలో వుందా?"
"అవును"
"మీరు పుట్టిన సంవత్సరం 1978"
"అవును"
"మీకు లవ్ ఫైల్యూర్ ఎమైనా వుందా"
"లేదు"
మధ్యలో మరో తాళపత్రం తెచ్చాడు.
"మీకొక సోదరుడు"
"లేదు"
"మీరు పుట్టిన నెల జూన్"
"అవును"
"మీకొక చెల్లెలు"
"అవును"
"మీరు పుట్టిన తేది 4, 6, 8 లలో దెనితోనైనా ముగుస్తుందా?"
"లేదు"
"మీకు ఈ మధ్య ఏదైనా ఆక్సిడెంట్ అయ్యిందా"
"లేదు"
"మీరు పుట్టిన తేది 2"
"అవును"
"మీరు చేసే వుద్యోగం పోస్టాఫీసులో.."
"లేదు"
"రైల్వేలో?"
"అవును"
"మీ పేరు చివర్లో శర్మ, శాస్త్రి, రెడ్డి, నాయుడు, లాంటిది వుంది"
"లేదు"
(ఇంకా ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగాడు. అందులో ముఖ్యమైనవి మాత్రం ఇక్కడ చెప్పాను.) అతను ఇక్కడ ఆపి -
"మీ జాతకం దొరికేట్టే వుంది. వుండండి మరొకటి తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళాడు. నేను ఒక్కసారి ప్రశ్నలన్నీ తిరిగి గుర్తు తెచ్చుకున్నాను. ఎక్కడో ఏదో లింకు దొరుకుతోంది...!! తళుక్కున మెరిసింది..!!
"ఇప్పుడు అతను తిరిగి రాగానే అడగబోయే ప్రశ్న - "మీ నక్షత్రం ఆశ్వని అవునా కాదా?". అలా అడిగాడంటే నా వూహ సరైనదే" అనుకున్నాను. అతను వచ్చాడు. నాకు నా గుండె కొట్టుకోవటం స్పష్టంగా తెలుస్తోంది. అతను కూర్చొని నవ్వి అడిగాడు -
"మీ నక్షత్రం అశ్వని. అవునా కాదా?"
(ఇదెలా జరిగింది.. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఒకసారి ప్రశ్నలను మళ్ళీ చూడండి. అప్పటికీ సమాధానం దొరకకపోతే తరువాత టపాదాకా ఆగాల్సిందే.)
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)
మరో రెండు నెలలు గడిచాయి. ఈ సారి గుంటూరులో వాళ్ళ బ్రాంచి వచ్చిందని పేపర్లో చదివాను. మళ్ళీ నా తెహల్కా మొదలైంది. ఈసారి మరీ అనుమానంతో కాకుండా కొంచెం నమ్మేవాడిలా ప్రవర్తించాలని అనుకున్నాను. మళ్ళీ అదే రకమైన గది, మళ్ళీ అదే కాషాయం, తాళపత్రం, అదే వుపోద్ఘాతం. ఆ తరువాత తమిళంలో పద్యాలు, తెలుగు తర్జుమా ప్రశ్నలు.
"మీ పేరు ర, క, మ తో ప్రారభమౌతుందా?"
"లేదు"
"అయితే ఈ పేజిలో లేదు.
"అంటే"
"ఇది మరెవరిదో. ఒక్కొక్క పత్రంలో ఒక్కొక్కరి జాతకం వుంటుంది.
"సరే అడగండి"
"మీ వయసు 21-25 మధ్యలో వుందా"
"అవును"
"మీ సొంతవూరు గుంటూరు"
"సొంత వూరంటే పుట్టిన వూరా? పెరిగిన వూరా?"
"ఎక్కువ కాలం గడిపిన వూరు"
"గుంటూరే.. పుట్టింది మాత్రం నెల్లూరు"
"గుంటూరే వుంది.. మీ నక్షత్రం ప, మ, ఆ లతో మొదలౌతుందా"
"లేదు"
"మీరు పుట్టిన నెల జనవరి నుంచి జూన్లో వుందా?"
"వుంది"
"మీకు చిన్నప్పుడు చిన్న అగ్ని ప్రమాదం జరిగిందా?"
"చిన్నప్పుడంటే ఆరో ఏట దీపావళికి టపాసు కాలుస్తుంటే చేతిలో పేలింది"
"మీరు పుట్టిన తేది సరి సంఖ్యా"
"అవును"
"మీరు ప్రైవేటు అంటే బ్యాంకులు, సాఫ్ట్వేర్ వుద్యోగం చేస్తున్నారా?"
"లేదు"
"మీరు గవర్న్మెంటు వుద్యోగం చేస్తున్నారా"
"అవును"
"మీరు పుట్టిన నెల వైశాఖం, జేష్టం ఆషాఢంలో వుందా?"
"అవును"
"మీరు పుట్టిన సంవత్సరం 1978"
"అవును"
"మీకు లవ్ ఫైల్యూర్ ఎమైనా వుందా"
"లేదు"
మధ్యలో మరో తాళపత్రం తెచ్చాడు.
"మీకొక సోదరుడు"
"లేదు"
"మీరు పుట్టిన నెల జూన్"
"అవును"
"మీకొక చెల్లెలు"
"అవును"
"మీరు పుట్టిన తేది 4, 6, 8 లలో దెనితోనైనా ముగుస్తుందా?"
"లేదు"
"మీకు ఈ మధ్య ఏదైనా ఆక్సిడెంట్ అయ్యిందా"
"లేదు"
"మీరు పుట్టిన తేది 2"
"అవును"
"మీరు చేసే వుద్యోగం పోస్టాఫీసులో.."
"లేదు"
"రైల్వేలో?"
"అవును"
"మీ పేరు చివర్లో శర్మ, శాస్త్రి, రెడ్డి, నాయుడు, లాంటిది వుంది"
"లేదు"
(ఇంకా ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగాడు. అందులో ముఖ్యమైనవి మాత్రం ఇక్కడ చెప్పాను.) అతను ఇక్కడ ఆపి -
"మీ జాతకం దొరికేట్టే వుంది. వుండండి మరొకటి తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళాడు. నేను ఒక్కసారి ప్రశ్నలన్నీ తిరిగి గుర్తు తెచ్చుకున్నాను. ఎక్కడో ఏదో లింకు దొరుకుతోంది...!! తళుక్కున మెరిసింది..!!
"ఇప్పుడు అతను తిరిగి రాగానే అడగబోయే ప్రశ్న - "మీ నక్షత్రం ఆశ్వని అవునా కాదా?". అలా అడిగాడంటే నా వూహ సరైనదే" అనుకున్నాను. అతను వచ్చాడు. నాకు నా గుండె కొట్టుకోవటం స్పష్టంగా తెలుస్తోంది. అతను కూర్చొని నవ్వి అడిగాడు -
"మీ నక్షత్రం అశ్వని. అవునా కాదా?"
(ఇదెలా జరిగింది.. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఒకసారి ప్రశ్నలను మళ్ళీ చూడండి. అప్పటికీ సమాధానం దొరకకపోతే తరువాత టపాదాకా ఆగాల్సిందే.)
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
Unknown
చాలాకాలం క్రిందట ఒక పేరుగల రచయిత ఒక వారపత్రికలో ఒక సీరియల్ వ్రాసారు. తమిళ్నాడులో వైదీశ్వరన్ కోయల్ అనే ప్రాంతంలో నాడీ జ్యోతిషం ఆ నవలలో ప్రధానాంశం. సదరు వూర్లో అడుగుపెట్టిన ప్రతివారి జాతకం అక్కడ వున్న అనేకానేక జ్యోతిష్యుల ఇళ్ళలో వశపారంపర్యంగా వస్తున్న తాళపత్ర గ్రంధాలలో వ్రాసి వుంటుంది. ప్రతి రాత్రి అగస్త్య మహాముని స్వయంగా వచ్చి ఆ గ్రంధాలలో మర్నాడు జాతకం చెప్పించుకునేందుకు రాబోయే వారి వివరాలు వ్రాసి వెళ్తాడు. చిత్రంగా అక్కడికి వచ్చిన వారందరి వివరాలు, పేరు, వూరు, తల్లిదండ్రుల పేర్లు, గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు, ఆఖరికి ఫలానా ఫలానా రోజు సదరు వ్యక్తి రాబోతున్నాడన్న విషయంతో సహా అన్నీ సవివరంగా వ్రాయబడి వుంటాయి. ఆ నవల అప్పట్లో సంచలనం రేపింది. ఎందరెందరో స్వయంగా అక్కడికి వెళ్ళి తమ తమ నాడీ జ్యోతిషం చెప్పించుకున్నారు. కేవలం వేలి ముద్ర మాత్రమే తీసుకొని ఆ వేలు ముద్ర ఆధారంగా అంత వివరంగా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పటం చూసి అబ్బురపడ్డారు.
అలా వెళ్ళిన వ్యక్తులలో నా మిత్రుడు ఒకడున్నాడు. వాడు తిరిగొచ్చి ఆ విశేషాలు చెప్తుంటే మా మిత్ర బృందం నోరెళ్ళబెట్టి విన్నాము. ఒక కేసెట్లో అన్ని వివరాలు రికార్డ్ చేసి ఇచ్చారు. అది వింటుంటే దాదాపు అన్ని విషయాలు అంత సరిగ్గా చెప్పటం చూస్తుంటే ఇదెలా సాధ్యం అని అనుమానం వచ్చింది. అలాగని నేను జ్యోతిషం నమ్మనని కాదు. నాకు కూడా జ్యోతిషంలో ప్రావీణ్యం కాకపోయినా ప్రవేశం వుంది. నాకు ఆ విద్యను పరిచయం చేసిన గురువుగారు అందులో వున్న శాస్త్రీయతని, తార్కాన్ని చెప్పి వుండటంతో అలాంటిదేమి లేని నాడీ జ్యోతిషం గురించి అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత ఆ విషయాన్ని తొందర్లోనే మర్చిపోయాను.
అయితే ఆ మిస్టరీ ఛేదించాలని అగస్త్య మహామునే వ్రాసాడేమో అన్నట్టు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మళ్ళీ అదే విషయం గురించి చర్చ జరిగింది. మా మిత్ర బృందంలో ఒక అమ్మాయి ఏదో ఒక సమస్య గురించి నాడీ జ్యోతిష్యులని సంప్రదించే ప్రయత్నంలో వుండింది. అప్పటికి హైదరాబాదులో నాడీ జ్యోతిష్యుల బ్రాంచి ఒకటి (శివం దగ్గర) మొదలైందని తెలిసి మరింత సంతోషించింది. మొత్తానికి అదేంటో తెలుసుకోవాలని ఇద్దరం, తమ జాతకం తెలుసుకోవాలని ఇద్దరు, మొత్తం నలుగురం బయలుదేరి అక్కడికి చేరుకున్నాం.
ఎంట్రీ ఫీజు లాంటిదేమి లేదు. మీ జాతకం అక్కడ దొరికితేనే అది చెప్పించుకుంటేనే డబ్బులు ఇవ్వాలి. దాంతో నలుగురం మా మా వేలి ముద్రలిచ్చాం. నలుగురిని నాలుగు గదుల్లోకి పంపించారు. అప్పటికీ మేమెవరైనా ఆ అమ్మాయికి తోడుగా వుంటామని చెప్పినా వొప్పుకోలేదు. నాడీ జ్యోతిష్యం కేవలం వ్యక్తిగతంగానే చెప్పబడుతుందని అందుకని వేరే వ్యక్తిని ఎవరినీ (తల్లిదండ్రులైనా, తోడబుట్టినవారైన సరే..!) అనుమతించరని చెప్పారు. చేసేది లేక నేను నాకోసం చెప్పబడిన గదిలో అడుగు పెట్టాను.
లోపల చాలా తక్కువ వెలుతురు వుంది. అక్కడేదో పూజ జరిగినట్టు దీపంలో నూనె కాలుతున్న వాసన. అంతలో ఒక తాళ పత్ర గ్రంధం చేతిలో పట్టుకొని, కాషాయ వస్త్రాలతో ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. నా ముందు పద్మాసనం వేసుకొని అన్నాడు -
"మీ వేలిముద్రను అనుసరించి కొన్ని తాళపత్ర గ్రంధాలను తీసి పెట్టాము. అందులో వున్న కొన్ని విషయాలను చదివి చెప్తాను. అవన్నీ తమిళంలో వుంటాయి కాబట్టి పద్యం చదివి తెలుగులో చెప్తాను. అవి మీ విషయంలో సరైనవి అయితే "అవును" అని లేకపోతే "కాదు" అని మాత్రం సమాధానం చెప్పాలి. ఆ విధంగా మీకు సంబంధించి అన్ని వివరాలు సరిగా దొరికే తాళపత్ర గ్రంధం దొరికే వరకు చేస్తాము. ఒకసారి మీ నాడీ గ్రంధం దొరకగానే అన్ని వివరాలు మేమే చెప్తాము."
నేను సరే అని స్థిరంగా కూర్చున్నాను. అతను ప్రారంభించాడు. ఒక్కొక్క పత్రమే తిప్పుతూ అందులో వున్న ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను అవును, కాదు అని మాత్రం చెప్తున్నాను. ఒక గ్రంధం పూర్తైపోగానే మరో గ్రంధం తెచ్చాడు. అది అయిపోగానే మరొకటి.. ఒక నాలుగు గ్రంధాలు చూసిన తరువాత పెదవి విరిచి చెప్పాడు -
"మీ నాడీ జ్యోతిషం ఈ రోజు చెప్పించుకుంటారని అగస్త్య మహాముని వ్రాయలేదు. మీరు మళ్ళీ ప్రయత్నించాలి - ఒక నెల తరువాత."
నేను నిరాశగా వెనుతిరిగాను. బయట నాతో వచ్చిన మరో మిత్రుడు నిలబడి వున్నాడు. "నాదీ దొరకలేదు" అన్నాడు నవ్వుతూ.
"వాళ్ళిద్దరు?" అడిగాను కుతూహలంగా.
"లోపలున్నారు. వాళ్ళవి దొరికినట్టున్నాయి.." అన్నాడు ఆ గదుల వైపు చూపిస్తూ. వాడూహించింది నిజమే. కొంతసేపటి తరువాత ఆ ఇద్దరూ బయటకి వచ్చారు. వాళ్ళిద్దరి ముఖంలో వెలుగు..!!
లోపల జరిగినది వింటే కొంత ఆశ్చర్యం, కొంత అనుమానం, కొంత థ్రిల్.. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ సరిగ్గా వున్నాయి.
పేరు, వూరు, పుట్టిన తేది, నక్షత్రం, మూడేళ్ళ వయసులో జరిగిన ప్రమాదం, తండ్రి పేరు, ఆయన చేసే వుద్యోగం, ప్రస్తుతం వేధిస్తున్న సమస్య, దానికి పరిష్కారం, జరగబోతున్న విషయాలు. మరీ ఒకరికైతే అన్నయ్య పేరు అతను చేస్తున్న వుద్యోగం, పుట్టుమచ్చల్తో సహా చెప్పేశారు.
"ఇదెలా సాధ్యమైంది?"
"తెలియదు. వాళ్ళు తీసిన చివరి గ్రంధంలో వరసగా అన్ని విషయాలు వ్రాసున్నాయి. ఆశ్చర్యం కదూ"
"ఆశ్చర్యం కాదు అనుమానం.. ఇదేంటో కనిపెట్టల్సిందే" అనుకున్నాను నేను బయటకి నడుస్తూ.
(అసలు రహస్యం తరువాత టపాలో)
రెండో భాగం కోసం ఇక్కడ నొక్కండి
మూడో భాగం కోసం ఇక్కడ నొక్కండి
అలా వెళ్ళిన వ్యక్తులలో నా మిత్రుడు ఒకడున్నాడు. వాడు తిరిగొచ్చి ఆ విశేషాలు చెప్తుంటే మా మిత్ర బృందం నోరెళ్ళబెట్టి విన్నాము. ఒక కేసెట్లో అన్ని వివరాలు రికార్డ్ చేసి ఇచ్చారు. అది వింటుంటే దాదాపు అన్ని విషయాలు అంత సరిగ్గా చెప్పటం చూస్తుంటే ఇదెలా సాధ్యం అని అనుమానం వచ్చింది. అలాగని నేను జ్యోతిషం నమ్మనని కాదు. నాకు కూడా జ్యోతిషంలో ప్రావీణ్యం కాకపోయినా ప్రవేశం వుంది. నాకు ఆ విద్యను పరిచయం చేసిన గురువుగారు అందులో వున్న శాస్త్రీయతని, తార్కాన్ని చెప్పి వుండటంతో అలాంటిదేమి లేని నాడీ జ్యోతిషం గురించి అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత ఆ విషయాన్ని తొందర్లోనే మర్చిపోయాను.
అయితే ఆ మిస్టరీ ఛేదించాలని అగస్త్య మహామునే వ్రాసాడేమో అన్నట్టు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మళ్ళీ అదే విషయం గురించి చర్చ జరిగింది. మా మిత్ర బృందంలో ఒక అమ్మాయి ఏదో ఒక సమస్య గురించి నాడీ జ్యోతిష్యులని సంప్రదించే ప్రయత్నంలో వుండింది. అప్పటికి హైదరాబాదులో నాడీ జ్యోతిష్యుల బ్రాంచి ఒకటి (శివం దగ్గర) మొదలైందని తెలిసి మరింత సంతోషించింది. మొత్తానికి అదేంటో తెలుసుకోవాలని ఇద్దరం, తమ జాతకం తెలుసుకోవాలని ఇద్దరు, మొత్తం నలుగురం బయలుదేరి అక్కడికి చేరుకున్నాం.
ఎంట్రీ ఫీజు లాంటిదేమి లేదు. మీ జాతకం అక్కడ దొరికితేనే అది చెప్పించుకుంటేనే డబ్బులు ఇవ్వాలి. దాంతో నలుగురం మా మా వేలి ముద్రలిచ్చాం. నలుగురిని నాలుగు గదుల్లోకి పంపించారు. అప్పటికీ మేమెవరైనా ఆ అమ్మాయికి తోడుగా వుంటామని చెప్పినా వొప్పుకోలేదు. నాడీ జ్యోతిష్యం కేవలం వ్యక్తిగతంగానే చెప్పబడుతుందని అందుకని వేరే వ్యక్తిని ఎవరినీ (తల్లిదండ్రులైనా, తోడబుట్టినవారైన సరే..!) అనుమతించరని చెప్పారు. చేసేది లేక నేను నాకోసం చెప్పబడిన గదిలో అడుగు పెట్టాను.
లోపల చాలా తక్కువ వెలుతురు వుంది. అక్కడేదో పూజ జరిగినట్టు దీపంలో నూనె కాలుతున్న వాసన. అంతలో ఒక తాళ పత్ర గ్రంధం చేతిలో పట్టుకొని, కాషాయ వస్త్రాలతో ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. నా ముందు పద్మాసనం వేసుకొని అన్నాడు -
"మీ వేలిముద్రను అనుసరించి కొన్ని తాళపత్ర గ్రంధాలను తీసి పెట్టాము. అందులో వున్న కొన్ని విషయాలను చదివి చెప్తాను. అవన్నీ తమిళంలో వుంటాయి కాబట్టి పద్యం చదివి తెలుగులో చెప్తాను. అవి మీ విషయంలో సరైనవి అయితే "అవును" అని లేకపోతే "కాదు" అని మాత్రం సమాధానం చెప్పాలి. ఆ విధంగా మీకు సంబంధించి అన్ని వివరాలు సరిగా దొరికే తాళపత్ర గ్రంధం దొరికే వరకు చేస్తాము. ఒకసారి మీ నాడీ గ్రంధం దొరకగానే అన్ని వివరాలు మేమే చెప్తాము."
నేను సరే అని స్థిరంగా కూర్చున్నాను. అతను ప్రారంభించాడు. ఒక్కొక్క పత్రమే తిప్పుతూ అందులో వున్న ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను అవును, కాదు అని మాత్రం చెప్తున్నాను. ఒక గ్రంధం పూర్తైపోగానే మరో గ్రంధం తెచ్చాడు. అది అయిపోగానే మరొకటి.. ఒక నాలుగు గ్రంధాలు చూసిన తరువాత పెదవి విరిచి చెప్పాడు -
"మీ నాడీ జ్యోతిషం ఈ రోజు చెప్పించుకుంటారని అగస్త్య మహాముని వ్రాయలేదు. మీరు మళ్ళీ ప్రయత్నించాలి - ఒక నెల తరువాత."
నేను నిరాశగా వెనుతిరిగాను. బయట నాతో వచ్చిన మరో మిత్రుడు నిలబడి వున్నాడు. "నాదీ దొరకలేదు" అన్నాడు నవ్వుతూ.
"వాళ్ళిద్దరు?" అడిగాను కుతూహలంగా.
"లోపలున్నారు. వాళ్ళవి దొరికినట్టున్నాయి.." అన్నాడు ఆ గదుల వైపు చూపిస్తూ. వాడూహించింది నిజమే. కొంతసేపటి తరువాత ఆ ఇద్దరూ బయటకి వచ్చారు. వాళ్ళిద్దరి ముఖంలో వెలుగు..!!
లోపల జరిగినది వింటే కొంత ఆశ్చర్యం, కొంత అనుమానం, కొంత థ్రిల్.. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ సరిగ్గా వున్నాయి.
పేరు, వూరు, పుట్టిన తేది, నక్షత్రం, మూడేళ్ళ వయసులో జరిగిన ప్రమాదం, తండ్రి పేరు, ఆయన చేసే వుద్యోగం, ప్రస్తుతం వేధిస్తున్న సమస్య, దానికి పరిష్కారం, జరగబోతున్న విషయాలు. మరీ ఒకరికైతే అన్నయ్య పేరు అతను చేస్తున్న వుద్యోగం, పుట్టుమచ్చల్తో సహా చెప్పేశారు.
"ఇదెలా సాధ్యమైంది?"
"తెలియదు. వాళ్ళు తీసిన చివరి గ్రంధంలో వరసగా అన్ని విషయాలు వ్రాసున్నాయి. ఆశ్చర్యం కదూ"
"ఆశ్చర్యం కాదు అనుమానం.. ఇదేంటో కనిపెట్టల్సిందే" అనుకున్నాను నేను బయటకి నడుస్తూ.
(అసలు రహస్యం తరువాత టపాలో)
రెండో భాగం కోసం ఇక్కడ నొక్కండి
మూడో భాగం కోసం ఇక్కడ నొక్కండి
Unknown
ఇప్పటిదాకా యుద్ధం అంటే ఎక్కడో దేశ సరిహద్దులో జరిగేదనుకునేవాళ్ళం... దేశానికి వాణిజ్య రాజధాని ముంబై నగరంలో అత్యంత సంపన్నులుండే ప్రదేశంలో, చారిత్రాత్మక గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర్లో, వాటిని వీక్షించడానికొచ్చే సందర్శకుల్తో కిట కిట లాడే ప్రాంతంలో యుద్ధం జరుగుతుందని మనం ఎవరం వూహించి వుండం..!! పోలీసులూ, నిఘా వర్గాలూ వుహించి వుండక పోవటం కొసమెరుపు..!!
ఇప్పటిదాకా టెర్రరిజానికి ముఖం లేదు అనుకున్నాం. దర్జాగా సీసీ కెమెరాల్లో ఫొటోకి ఫోజిచ్చినట్టు నిలబడ్డ పాతికేళ్ళ కుర్ర టెర్రరిస్టులు ఇప్పుడు అందరికీ కలల్లోకి వచ్చే టెర్రరిజం ముఖచిత్రాలు. అరవై గంటలపాటు పోరాడటానికి సరిపడా గ్రెనేడ్లు, తుపాకులు, బులెట్లు హోటల్ గదిలో నింపుకో గలిగిన తీవ్రవాదులు మన పోలీసు తెలివితేటల్ని నరిమన్ పాయింట్లో నగ్నంగా నిలబెట్టారు.
బులెట్ ప్రూఫ్ జాకెట్లు వున్నా మన పోలీసులు, కమేండోలు ఎందుకు చనిపోయారు అని ఒక్కరైనా అడగరేం..? అసలు పట్టుమని పది మందైనా లేని టెర్రరిస్టులని ఎదురుకోవడానికి నాలుగొందలు పైబడిన పోలీసులు, కమేండోలకి అరవై గంటలు ఎందుకు పట్టిందని ఎవరూ అడగరేం..? ఉన్నికృష్ణన్ శవం చూపిస్తూ - "మంజునాథన్.. ఉన్నికృష్ణన్ శవం చూడటానికి ఎవరెవరు వచ్చారు.. సినిమా స్టార్లు ఎవరైనా వచ్చారా..?" అని అడిగే టీవీ యాంకర్లకి ఈ ప్రశ్నలు గుర్తుకు రావా..?
గుర్తుకు రావు.. ఎవ్వరూ అడగరు.. ఎందుకంటే నిజాలు బయటికి వస్తాయి. నిజం వినాలని వుందా..??
పోలీసులు వేసుకున్న జాకెట్లను చూడండి.. గూగులమ్మని అడిగితే చిత్రాలతో ఆ జాకెట్ల గురించి చెప్తుంది. అవి బులెట్లను తట్టుకునే జాకెట్లు కావు. వాళ్ళు పెట్టుకున్న హెల్మెట్లు రాళ్ళ దాడిని మాత్రమే నిరోధించడానికి తయారు చేసినవి. బులెట్ల ధాటికి అవి ఆగలేవు..!! ఎందుకంటే పోలీసులు "ఇలాంటి" సంఘటనలు ఎదురుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో చెదురుమొదురు సంఘటనలంటారే అలాంటివాటికి మాత్రమే సిద్ధంగా వున్నారు. మొదటి రోజు రాత్రి బులెట్ ప్రూఫు జాకెట్లు తయారు చేసే సంస్థ ఒకటి వాటిని పోలీసులకు వుచితంగా పంచి పెట్టిన సంగతి మీడియా వారికి తెలియనే తెలియదెందుకో..?
అయితే పోలీసుల దగ్గర ఇవి లేవా అంటే.. వున్నాయి. టెండర్లలో అందరికన్నా చవకగా కొటేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కొని (అంటే మీకు తెలుసుగా ఎవరి కొటేషన్ ఎందుకు తెల్లారే సరికి చౌకైపోతుందో) స్టోర్లో పెట్టి తాళంవేసి వుంచారు. ఇలాంటి సందర్భంలో ఆ స్టోరెక్కడ వుందో తెలుసుకోని, ఇండెంట్ పెట్టి తీసుకొని వేసుకోవాలి. అన్నట్టు మరిచాను.. దానికి ముందు టెర్రరిస్టులను అప్పటిదాకా ఆగండి నాయనా అని చెప్పి వెళ్ళి తెచ్చుకోవాలి..!!
పరామర్శ పేరుతో వచ్చే రాజకీయ నాయకులకు భద్రత కల్పించాలా లేక టెర్రరిస్టుల సంగతి చూడాలా అని అడిగే పోలీస్ ఆఫీసరు ఫ్రస్ట్రేషనంతా ఆ తీవ్రవాదిని కిటికీలోనించి పడేసటప్పుడు తీరి వుంటుంది. మునుపు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు విపరీతమైన మంచులో కాళ్ళకున్న జోళ్ళు చాలక మంచులో పనికొచ్చే షూస్ పంపించమంటే కాంట్రాక్టర్ల గోలుమాలులో చిన్న పిల్లల షూస్ పంపించిన అవినీతి నాయకులేగా వీళ్ళంతా..! ఆ రోజు కార్గిల్ మంచుకి తట్టుకోలేక రక్తపు అడుగులేసిన సైనికుడెవరైనా తాజ్ దగ్గర వుండుంటే ఆ పరామర్శగాళ్ళని ముందు కాల్చేసేవాడు.
అన్నట్టు మరో అనుమానం..!! నాలుగు వందల మంది ఎన్ఎస్జీ కమెండోలలో చాలావరకు ఉత్తర భారతీయులు వున్నార్ట.. ముంబైలో వుత్తర భారతీయులా...!! రాజ్ థాకరే..!! వీళ్ళనెలా రానిచ్చావ్.. తరిమికొట్టకపోయావా..!!
ఇదంతా జరిగి కొంత మంచీ చేసింది -
తీవ్రవాదులపై నెగెటివిటీని ఇంకా పెంచింది, ఈ రోజు తీవ్రవాదం వైపు అడుగులెయ్యబోతున్న వారిలో ఒక్కడైనా ఈ మారణహోమం చూసి కనీసం ఒక్క అడుగు వెనక్కి వేసుంటాడు.దేశం మొత్తం సంఘటితంగా నిలబడింది, బ్లాగులు, మొబైళ్ళు చివరికి పిచ్చా పాటి కబుర్లు కూడా నిరశన వార్తలు మోశాయి..మీడియాకు, రాజకీయాలకు కొత్త టాపిక్ దొరికింది. పాపం పోతూ పోతూ న్యూస్ చానళ్ళకు టీఆర్పీలు ఇచ్చి వెళ్ళారు కార్కర్, ఉన్నికృష్ణన్. పాకిస్తాన్ ఒక రకంగా అంతర్జాతీయ రాజకీయాలలో ఇరుకున పడేట్టుంది..
కానీ
ఎక్కడో వొకచోట ఆక్రోశం ప్రతిహింసకు పునాదులు తొవ్వేవుంటుంది.. అది ఏ దుర్వార్తలు మోసుకొస్తుందో చూడాలి..!!
ఇప్పటిదాకా టెర్రరిజానికి ముఖం లేదు అనుకున్నాం. దర్జాగా సీసీ కెమెరాల్లో ఫొటోకి ఫోజిచ్చినట్టు నిలబడ్డ పాతికేళ్ళ కుర్ర టెర్రరిస్టులు ఇప్పుడు అందరికీ కలల్లోకి వచ్చే టెర్రరిజం ముఖచిత్రాలు. అరవై గంటలపాటు పోరాడటానికి సరిపడా గ్రెనేడ్లు, తుపాకులు, బులెట్లు హోటల్ గదిలో నింపుకో గలిగిన తీవ్రవాదులు మన పోలీసు తెలివితేటల్ని నరిమన్ పాయింట్లో నగ్నంగా నిలబెట్టారు.
బులెట్ ప్రూఫ్ జాకెట్లు వున్నా మన పోలీసులు, కమేండోలు ఎందుకు చనిపోయారు అని ఒక్కరైనా అడగరేం..? అసలు పట్టుమని పది మందైనా లేని టెర్రరిస్టులని ఎదురుకోవడానికి నాలుగొందలు పైబడిన పోలీసులు, కమేండోలకి అరవై గంటలు ఎందుకు పట్టిందని ఎవరూ అడగరేం..? ఉన్నికృష్ణన్ శవం చూపిస్తూ - "మంజునాథన్.. ఉన్నికృష్ణన్ శవం చూడటానికి ఎవరెవరు వచ్చారు.. సినిమా స్టార్లు ఎవరైనా వచ్చారా..?" అని అడిగే టీవీ యాంకర్లకి ఈ ప్రశ్నలు గుర్తుకు రావా..?
గుర్తుకు రావు.. ఎవ్వరూ అడగరు.. ఎందుకంటే నిజాలు బయటికి వస్తాయి. నిజం వినాలని వుందా..??
పోలీసులు వేసుకున్న జాకెట్లను చూడండి.. గూగులమ్మని అడిగితే చిత్రాలతో ఆ జాకెట్ల గురించి చెప్తుంది. అవి బులెట్లను తట్టుకునే జాకెట్లు కావు. వాళ్ళు పెట్టుకున్న హెల్మెట్లు రాళ్ళ దాడిని మాత్రమే నిరోధించడానికి తయారు చేసినవి. బులెట్ల ధాటికి అవి ఆగలేవు..!! ఎందుకంటే పోలీసులు "ఇలాంటి" సంఘటనలు ఎదురుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో చెదురుమొదురు సంఘటనలంటారే అలాంటివాటికి మాత్రమే సిద్ధంగా వున్నారు. మొదటి రోజు రాత్రి బులెట్ ప్రూఫు జాకెట్లు తయారు చేసే సంస్థ ఒకటి వాటిని పోలీసులకు వుచితంగా పంచి పెట్టిన సంగతి మీడియా వారికి తెలియనే తెలియదెందుకో..?
అయితే పోలీసుల దగ్గర ఇవి లేవా అంటే.. వున్నాయి. టెండర్లలో అందరికన్నా చవకగా కొటేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కొని (అంటే మీకు తెలుసుగా ఎవరి కొటేషన్ ఎందుకు తెల్లారే సరికి చౌకైపోతుందో) స్టోర్లో పెట్టి తాళంవేసి వుంచారు. ఇలాంటి సందర్భంలో ఆ స్టోరెక్కడ వుందో తెలుసుకోని, ఇండెంట్ పెట్టి తీసుకొని వేసుకోవాలి. అన్నట్టు మరిచాను.. దానికి ముందు టెర్రరిస్టులను అప్పటిదాకా ఆగండి నాయనా అని చెప్పి వెళ్ళి తెచ్చుకోవాలి..!!
పరామర్శ పేరుతో వచ్చే రాజకీయ నాయకులకు భద్రత కల్పించాలా లేక టెర్రరిస్టుల సంగతి చూడాలా అని అడిగే పోలీస్ ఆఫీసరు ఫ్రస్ట్రేషనంతా ఆ తీవ్రవాదిని కిటికీలోనించి పడేసటప్పుడు తీరి వుంటుంది. మునుపు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు విపరీతమైన మంచులో కాళ్ళకున్న జోళ్ళు చాలక మంచులో పనికొచ్చే షూస్ పంపించమంటే కాంట్రాక్టర్ల గోలుమాలులో చిన్న పిల్లల షూస్ పంపించిన అవినీతి నాయకులేగా వీళ్ళంతా..! ఆ రోజు కార్గిల్ మంచుకి తట్టుకోలేక రక్తపు అడుగులేసిన సైనికుడెవరైనా తాజ్ దగ్గర వుండుంటే ఆ పరామర్శగాళ్ళని ముందు కాల్చేసేవాడు.
అన్నట్టు మరో అనుమానం..!! నాలుగు వందల మంది ఎన్ఎస్జీ కమెండోలలో చాలావరకు ఉత్తర భారతీయులు వున్నార్ట.. ముంబైలో వుత్తర భారతీయులా...!! రాజ్ థాకరే..!! వీళ్ళనెలా రానిచ్చావ్.. తరిమికొట్టకపోయావా..!!
ఇదంతా జరిగి కొంత మంచీ చేసింది -
తీవ్రవాదులపై నెగెటివిటీని ఇంకా పెంచింది, ఈ రోజు తీవ్రవాదం వైపు అడుగులెయ్యబోతున్న వారిలో ఒక్కడైనా ఈ మారణహోమం చూసి కనీసం ఒక్క అడుగు వెనక్కి వేసుంటాడు.దేశం మొత్తం సంఘటితంగా నిలబడింది, బ్లాగులు, మొబైళ్ళు చివరికి పిచ్చా పాటి కబుర్లు కూడా నిరశన వార్తలు మోశాయి..మీడియాకు, రాజకీయాలకు కొత్త టాపిక్ దొరికింది. పాపం పోతూ పోతూ న్యూస్ చానళ్ళకు టీఆర్పీలు ఇచ్చి వెళ్ళారు కార్కర్, ఉన్నికృష్ణన్. పాకిస్తాన్ ఒక రకంగా అంతర్జాతీయ రాజకీయాలలో ఇరుకున పడేట్టుంది..
కానీ
ఎక్కడో వొకచోట ఆక్రోశం ప్రతిహింసకు పునాదులు తొవ్వేవుంటుంది.. అది ఏ దుర్వార్తలు మోసుకొస్తుందో చూడాలి..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)